గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

ఉండూరు గ్రామం / UNDURU VILLAGE

శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి

వృషభరాశి, కృత్తిక నక్షత్రం (4వ పాదం)

పాద శివలింగ స్ధానం: ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 5 kms. దూరాన, ఉండూరు గ్రామం (Unduru) కలదు. ఇచ్చట శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి ఆలయం ఉంది. కృత్తిక నక్షత్రములో 4వ పాదములలో జన్మంచిన వారి వలన తల్లికి దోషము కలుగను. వాటిని నివారించుటకు ఆలయం నందు అభిషేక శాంతులు నిర్వహించుతారు. శ్రీ మార్కండేయ లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. ద్రాక్షారామం - కాకినాడ రోడ్డు మార్గంలో ఉండూరు ఉంటుంది. బస్ సర్వీసులు ఉంటాయి.

ఆలయం: ఆలయం నకు పునర్నిర్మాణమం, పునః ప్రతిష్ట అవసరం ఉంది. గ్రామస్ధులు మరియు దాతలు ధన సహాకారములు అందించి, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శ్రీ ఉమా సమేత  శ్రీ మార్కండేయ స్వామి కొలువై యున్నాడు.  అంతరాలయం నందు ఉత్సవ మూర్తులు, గణపతి, నంది దర్శనమిస్తాయి. ముఖ మండపం విశాలముగా ఉంటుంది.  సుబ్రహ్మణ్యస్వామి మరియ ఆంజనేయ స్వామి మూర్తులు ఉంటారు.  ఇచ్చట స్వామి వారి కళ్యాణోత్సవం, విశేష పూజలు  మొదలగునవి జరుగుతుంటాయి. ఆలయం నందు నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. వీటితో పాటు అభిషేక శాంతులు నిర్వహించుతారు.

రవాణా సమాచారం: కోటిపల్లి నుంచి కాకినాడ పోవు బస్సులు (Via) ద్రాక్షారామం, తోటపేట, హసన్ బాద, ఉండూరు, గొల్లపాలెం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 5 Kms. దూరంలో ఉండూరు గ్రామం ఉంటుంది. యాత్రికులు ఉండూరు లోని శివాలయం బస్ స్టేజి దిగాలి. ద్రాక్షారామం నుంచి ఉండూరు నకు షేరింగ్ ఆటోలు కూడ దొరుకుతాయి.

అర్చక స్వామి: మాకు సహకరించిన ఉండూరు అర్చక స్వామి శ్రీ కొత్తలంక బాల సుబ్రహ్మణ్య శాస్త్రి, సెల్ నెం. 9248387435 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

కృత్తిక నక్షత్రం స్తోత్రం

అగ్నిమూర్ధాదివ: కకుత్పతి: పృథివ్యాయమమ్‌|

అపారేతా సిజన్వతి:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description