గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
108 నక్షత్ర పాద శివలింగాలు యొక్క Ebook ఉచితంగా Download చేసుకోండి
గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
గుమ్మిలేరు గ్రామం / GUMMILERU VILLAGE
శ్రీ ఉమా సమేత రామలింగ కోఠేశ్వర స్వామి
తులరాశి, స్వాతి నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం - దక్షిణ దిశగా, సుమారు 25 kms. దూరాన, గుమ్మిలేరు (Gummileru) గ్రామం ఉంది. ఇది కోనసీమ జిల్లా, ఆలమూరు మండలంకు చెందినది. గుమ్మిలేరు నందు శ్రీ ఉమా సమేత రామలింగ కోఠేశ్వర స్వామి (శివాలయం) కలదు. శ్రీ రామలింగ కోఠేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శివాలయం చాల ప్రాచీనమైనది. పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, గణపతి, నాగబంధము, చండీశ్వరాలయం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవత మూర్తులు కలరు. శ్రీ రామలింగ కోఠేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నుండి శుద్ధ పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి రాత్రులు ఘనంగా జరుగుతాయి. తులరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం : కాకినాడ - రావులపాలెం ప్రధాన రహదారిలో గుమ్మిలేరు ఉంది. మండపేట - ఆలమూరు రోడ్డులో గుమ్మిలేరు శివాలయం ఉంటుంది.
రవాణా సమాచారం : మండపేట బస్ స్టాండ్ నుంచి గుమ్మిలేరు కి బస్సులు/ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 5 Kms.
అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ పుల్లేటికుర్తి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, సెల్ నెం: 98480 84086 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
స్వాతి నక్షత్రం స్తోత్రం
క్యోయే తే సహస్రిణో స్థా సస్తే త్రిరాగది|
నియుత్వామ్ సోమ పీతయే||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.