గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

తనుమళ్ళ గ్రామం / TANUMALLA VILLAGE

శ్రీ పార్వతీ సమేత  శ్రీ నీలకంఠేశ్వర స్వామి

వృషభరాశి, రోహిణి నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 11 kms. దూరాన, తనుమళ్ళ గ్రామం (Tanumalla) కలదు. ఇచ్చట శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ నీలకంఠేశ్వర లింగము, రోహిణి నక్షత్రం (1వ పాదం) చెందినది. రోహిణి నక్షత్రము 1వ పాదములో జన్మించిన వారి వలన మేనమామకు మరియు తల్లికి దోషము కలుగను. వాటిని నివారించుటకు ఆలయం నందు అభిషేక శాంతులు నిర్వహించుతారు. శ్రీ నీలకంఠేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: ప్రాచీన ఆలయం గ్రామస్ధుల సహాకారముతో పునర్నిర్మించబడింది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శ్రీ పార్వతీ సమేత  శ్రీ నీలకంఠేశ్వర స్వామి కొలువై యున్నాడు. అంతరాలయం నందు ఉత్సవ మూర్తులు, గణపతి దర్శనమిస్తాయి.  ముఖ మండపం నందు నందీశ్వరుడు, శృంగి - బృంగి ద్వారపాలకులు మరియు సుబ్రహ్మణ్యడు, వీరభద్రుడు ఉంటారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం స్ధానిక గ్రామస్ధుని ఆర్ధిక సహయంతో ప్రతిష్టించబడినది. అతడు ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం నిర్వహించుతారు. గ్రామ అర్చకస్వాముల ఆర్ధిక సహయంతో శ్రీ వీరభద్రుడు స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది. వీరు శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రుడు స్వామి స్వామి వారి కళ్యాణం జ్యేష్టా శుద్ధ పాఢ్యమి నాడు నిర్వహించుతారు. శ్రీ పార్వతీ సమేత  శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి కళ్యాణం జ్యేష్టా శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. వీటితో పాటు గ్రహ అభిషేక శాంతులు నిర్వహించుతారు. 

రవాణా సమాచారం: కోటిపల్లి నుంచి కాకినాడ పోవు బస్సులు (Via) ద్రాక్షారామం, హసన్ బాద, ఉండూరు, జగన్నాధగిరి, గొల్లపాలెం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 8 Kms. దూరంలో జగన్నాధగిరి గ్రామం ఉంటుంది. ద్రాక్షారామం నుంచి జగన్నాధగిరి గ్రామం నకు బస్సులు, షేరింగ్ ఆటోలు కూడ దొరుకుతాయి.

జగన్నాధగిరి గ్రామం నకు ఆగ్నేయం దిశగా సుమారు 4 Kms. దూరం లో తనుమళ్ళ గ్రామం ఉంటుంది.  జగన్నాధగిరి గ్రామం నుంచి తనుమళ్ళ గ్రామం నకు (via) పెనుమళ్ళ మీదగా ఆటోలు దొరుకుతాయి. ఆటో రాను - పోను ఏర్పాట్లు చేసుకోవాలి. జగన్నాధగిరి లో ఆటోలు చాల తక్కువుగా దొరుకుతాయి. కాబట్టి ద్రాక్షారామం నుంచి తనుమళ్ళ గ్రామం నకు ఆటో రాను - పోను ఏర్పాట్లు చేసుకోవటం సౌక్యం. ద్రాక్షారామం నుంచి బయలు దేరిన ఆటోలు (via) ఉండూరు, ఉండూరు బ్రిడ్జి నుంచి కాలువ గట్టు మీదగా పెనుమళ్ళ చేరుకొంటాయి. పెనుమళ్ళ నుంచి తనుమళ్ళ గ్రామంకు వస్తాయి. వీటి మధ్య దూరం 9 Kms. గా ఉండును.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన తనుమళ్ళ - శ్రీ నీలకంఠేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొత్తలంక వెంకట రత్న ప్రసాద్ శాస్త్రీ,  సెల్ నెం. 9704435121 గార్కి మరియు శ్రీ కొత్తలంక రామరావు, హైదరాబాద్ గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

రోహిణి నక్షత్రం స్తోత్రం

బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్వాద్వి సీమ: పురచే

వేనయాయహ: సబుధ్వా ఉపమా అస్య విష్ఠా:

సతశ్చ యోనిమ సతశ్చ విధి:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description