గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

కుందూరు గ్రామం / KUNDURU VILLAGE

శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి

కుంభ రాశి, ధనిష్ఠ నక్షత్రం (4వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి దక్షిణ దిశగా సుమారు 5 kms. దూరాన కుందూరు (KUNDURU) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ మల్లేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం ధనిష్ఠ నక్షత్రం (4వ పాదం) చెందినది. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. అంతరాలయంలో గణపతి దర్శనమిస్తాడు. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ మల్లేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు నిర్వ హించబడతాయి. కుంభ రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: ద్రాక్షారామం - కోటిపల్లి రోడ్డు మార్గములో కుందూరు బస్ స్టాప్, కె. గంగవరం మొదలగునవి ఉంటాయి. కుందూరు బస్ స్టాప్ కు కొంత లోపలకి, అనగా సుమారు 750 meters దూరాన శివాలయం ఉంటుంది. రాజమండ్రి - కోటిపల్లి & కాకినాడ - కోటిపల్లి బస్సులు కుందూరు బస్ స్టాప్ మీదగా ఉంటాయి. ద్రాక్షారామం నుంచి కె. గంగవరం వరకు షేరింగ్ ఆటోలు కలవు.

అర్చక స్వామి: అర్చకస్వామి శ్రీ మద్దిరాల భాస్కర వాసు రామచంద్ర సత్యనారాయణ (రాంబాబు), Cell No. 96032 96104 సంప్రదించగలరు

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ధనిష్ఠ నక్షత్రం స్తోత్రం

వసో: పవిత్రమసి శతధారం వసో: పవిత్రమసి సహస్రధారమ్‌|

దేవస్త్యా సవితా పునాత్‌ వసో: పవిత్రేణ శతధారేణ సుప్త్వా కామధుక్ష:

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.