గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

అముజూరు గ్రామం / AMUJURU VILLAGE

శ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి

దనుస్సు రాశి, మూల నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం:  చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 13 kms. దూరాన అముజూరు  (Amujuru) అను గ్రామం కలదు. కొత్తూరు సెంటర్ - అంగర - కె గంగవరం రోడ్డు మార్గములో అముజూరు గ్రామం ఉంటుంది. ఇచ్చట శ్రీ సోమేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం మూల నక్షత్రం (3వ పాదం) చెందినది. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. అంతరాలయంలో గణపతి దర్శనమిస్తాడు. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ మల్లేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ మల్లేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు మాఘ శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతుంది. ధనుర్మాస, శరన్నవ రాత్రులు, గణపతి నవరాత్రులు కూడా వైభవోపేతంగా నిర్వహించబడతాయి. దనుస్సు రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. 

రవాణా సమాచారం: మండపేట నుంచి కోరుమిల్లి కి (Via) అంగర మీదగా బస్సులు ఉంటాయి. మండపేట నుండి ప్రతిరోజూ నాలుగు ట్రిప్పులు బస్సు సర్వీసు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మండపేట నుంచి అంగర కు షేరింగ్ ఆటోలు ఉంటాయి. అంగర నుంచి అముజూరు కు షేరింగ్ ఆటోలు ఉంటాయి.

రవాణా సమాచారం: కాకినాడ నుంచి కోరుమిల్లి గ్రామం నకు (Via) గొల్లపాలెం,  ద్రాక్షారామం, కె.గంగవరం, అముజూరు మీదగా బస్సులు ఉంటాయి.

రవాణా సమాచారం: కాకినాడ నుండి ప్రతిరోజూ నాలుగు ట్రిప్పులు బస్సు సర్వీసు అందుబాటులో ఉన్నాయి. 

రవాణా సమాచారం: కాకినాడ - కత్తుంగ బస్సులు (via) ద్రాక్షారామం, కె.గంగవరం, అముజూరు, అంగర, వెదురుమూడి, కొత్తూరు సెంటర్, రావులపాలెం మీదగా ఉంటాయి. ఇవి చాల తక్కువుగా ఉంటాయి. 

అర్చక స్వామి: అర్చకస్వామి శ్రీ వెలవలపల్లి సుబ్బారావు, సెలె నెం : 98496 89703  సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి. 

వీరి Cell 83320 29544. 

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

మూల నక్షత్రం స్తోత్రం

మాతేవ పుత్ర పృథివీ పురీష్యమాణి స్వేయేనావ భారుషా|

తాం విశ్వదేవరుతిభి: సంవదాన: ప్రజాపతిర్విశ్వకర్మా విముంచత్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.