గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

మెళ్ళూరు గ్రామం / MELLURU VILLAGE

శ్రీ విశాలక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

సింహరాశి, మఖ నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తరం దిశగా, సుమారు 14 kms. దూరాన మెళ్ళూరు గ్రామం (Melluru) కలదు.  రామచంద్రపురం - కాకినాడ రోడ్డు మార్గములో చోడవరం జంక్షన్ ఉంటుంది. చోడవరం నకు ఉత్తరం - ఈశాన్యం దిశగా ఆరికిరేవుల సమీపంలో మెళ్ళూరు గ్రామం కలదు. చోడవరం జంక్షన్ నంచి ఆరికిరేవుల గ్రామం మీదగా బ్రాంచి రోడ్డు మార్గము కలదు. మెళ్ళూరు ఊరు నందు శ్రీ విశాలక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం చాల ప్రసిద్ధి. శ్రీ విశ్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: మెళ్ళూరు గ్రామం లోని శివాలయం చాల ప్రాచీనమైనది.  అగస్త్య మహర్షి లింగ ప్రతిష్ట గావించాడు. ప్రకృతి వైపరీత్యాలు కారణముగా శివాలయం ధ్వంసం అయింది.  కొంత కాలము తర్వాత అనగా 1981 సంవత్సరమున సమీపంలో గల చెరువు నందు శివలింగము బయలు పడింది. గ్రామస్ధులు ఆ శివలింగాన్నికి చిన్న గుడి నిర్మించారు. పిదప 1983 సంవత్సరం నందు మరో పెద్ద ఆలయం నిర్మించి, కాశి నుంచి మరో శివలింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు. దీనితో పాటు శ్రీ విశాలక్షి అమ్మవారి ప్రతిష్ట కూడ గ్రామస్ధులు గావించారు. ఇప్పటికి వృద్ధ శివలింగాన్నికి గ్రామస్ధులు అర్చనలు నిర్వహించుచున్నారు.

మెళ్ళూరు గ్రామం లోని శ్రీ విశాలక్షి సమేత  శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణము విశాలముగాను, తూర్పు అభిముఖంగా ఉంటుంది.  ఆలయ ప్రవేశం దక్షిణ ముఖద్వారం నుంచి జరుగుతుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, నంది, ప్రధానాలయం, శివకోటి స్తూపం, చండీశ్వరుడు, దత్రాత్రేయుడు, నవగ్రహ మండపం మరియు వృద్ద శివలింగము ఉంటాయి. ముఖ మండపం నందు నందీశ్వరుడు, ద్వారపాలకులు ఉన్నారు. అంతరాలయం నందు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు గణపతి మూర్తి కలరు. గర్భాలయం నందు  శ్రీ విశ్వేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు శ్రీ విశాలక్షి దేవి కొలువుదీరింది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాల తోరణం, శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు జరుగుతాయి. మహాశివ రాత్రి సందర్భముగా లింగోద్భవ కాల పూజ నిర్వహించుతారు. మెళ్ళూరు గ్రామం లోని దుర్గమ్మ గుడి కూడ దర్శనీయం.

శ్రీ విశ్వేశ్వర లింగము, మఖ నక్షత్రం (2వ పాదం) చెందినది.

మఖ నక్షత్రం నందలి 2వ పాదము లో జన్మంచిన స్త్రీ వలన తల్లికి, పురుషుడు వలన తండ్రికి దోషం కలుగను. మఖ నక్షత్రం (2వ పాదం) నందు జన్మించిన వారికి శాంతులు నిర్వహించుతారు.

నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ కొమాళ్ళపల్లి కాశీ విశ్వేశ్వర రావు, సెల్ నెం. 9010545349 సంప్రదించగలరు.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 7 kms. దూరంలో ద్రాక్షారామం -రామచంద్రాపురం జంక్షన్ ఉంటుంది. ద్రాక్షారామం నుంచి బస్సులు / ఆటోలు దొరుకుతాయి.

రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి మెళ్ళూరు గ్రామం కు బస్సులు చాల తక్కువుగా దొరుకుతాయి.

రామచంద్రాపురం నుంచి మెళ్ళూరు గ్రామం నకు ఆటోలు రాను - పోను ఏర్పాట్టు చేసుకోవడం సౌక్యముగా ఉంటుంది.  రామచంద్రాపురం - మెళ్ళూరు మధ్య దూరం సుమారు 9 Kms,

రవాణా సమాచారం 2: మెళ్ళూరు గ్రామం నకు సమీప రైల్వే స్టేషన్స్ సామర్లకోట జంక్షన్. విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గములో సామర్లకోట జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ముఖ్య రైలు సర్వీసులు ఆగుతాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ కు ఎదురుగా APSRTC బస్ స్టాండ్ ఉంటుంది. సామర్లకోట నుంచి రామచంద్రపురం కు బస్సులు బయులుదేరుతాయి. రామచంద్రపురం బస్సులు (Via) బిక్కవోలు, గొల్లల మామిడాడ. చింతపల్లి, నరసాపురపు పేట, చోడవరం జంక్షన్ మీదగా ఉండును. కొన్ని బస్సులు (Via) బిక్కవోలు, గొల్లల మామిడాడ. చింతపల్లి, మెళ్ళూరు, ఆరికిరేవుల, చోడవరం జంక్షన్ మీదగా ఉంటాయి. సామర్లకోట - మెళ్ళూరు మధ్య దూరం సుమారు 29 Kms. గా ఉంటుంది.

అర్చక స్వామి: మాకు సహకరించిన మెళ్ళూరు - శ్రీ కొమాళ్ళపల్లి కాశీ విశ్వేశ్వర రావు, సెల్ నెం. 9010545349గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.  దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

మఖ నక్షత్రం స్తోత్రం

పితృభ్య: స్వధాయిభ్య: స్వధానమ:|

పితామహేభ్య: స్వధాయిభ్య: స్వధానమ:

ప్రపితామహేభ్య: స్వదాయిభ్య: స్వధానమ:

అక్షన్న పిత్రో మీమదంత పితరోతితృ పంత్‌ పితర:

పితర: శుంధ ధ్వమ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.