గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

అర్తమూరు గ్రామం / ARTHAMURU VILLAGE

శ్రీ ఉమా సమేత అగస్త్వేశ్వర స్వామి

కన్యారాశి, చిత్త నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 19 kms. దూరాన, ఆర్తమూరు (Arthamuru) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలంకు చెందినది. అర్తమూరు నందు శ్రీ ఉమా సమేత అగస్త్వేశ్వర స్వామి (శివాలయం) కలదు. శ్రీ అగస్త్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. అగస్త్య మహర్షి ప్రతిష్టించిన పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమిలో అర్తమూరు క్షేత్రం ఒకటి (మండపేట, తాపేశ్వరం, చెల్లూరు, వల్లూరు క్షేత్రాలు మిగిలిన ప్రతిష్టలు).

అర్తమూరు ఆలయ కూడలిలో శివాలయంతో పాటు రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం, సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరాలయం, వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఆంజనేయస్వామివారి విగ్రహం మొదలగునవి దర్శనమిస్తాయి.

ఆలయం: శివాలయం చాల ప్రాచీనమైనది. పునర్నిర్మాణము జరిగింది. ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవత మూర్తులు కలరు. శ్రీ అగస్త్వేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి ఘనంగా జరుగుతాయి. అంతేగాక ప్రతి పౌర్ణమికి చండీయాగము నిర్వహించుతారు. ఆలయము నందు నాగబంధము మరియు గణపతి మూర్తులు ఉన్నారు. కన్యారాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం : కాకినాడ - రావులపాలెం మరియు రాజమండ్రి - కోటిపల్లి బస్సులు (వయా) మండపేట మీదగా ఉంటాయి.

మండపేట నుంచి అర్తమూరు గ్రామం నకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 4 kms.

రామచంద్రపురం - మండపేట ఆటోలు (వయా) పులగుర్త మీదగా ఉంటాయి. రామచంద్రపురం (రాజగోపాల సెంటర్) నుంచి మండపేట దొరుకుతాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ చేబ్రోలు కామేశ్వరరావు, సెల్ నెం: 98664 81797 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

చిత్త నక్షత్రం స్తోత్రం

త్వష్టా తురీయో అద్భుత ఇంద్రాగ్నీ పుష్టిర్వర్ధనమ్‌|

ద్విపద ఛందా ఇంద్రాయముక్షా గౌత్ర వయోదధ:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.