గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

తాతపూడి గ్రామం / TATAPUDI VILLAGE

శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

ధనుస్సు రాశి, ఉత్తరాషాడ నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 30 kms. దూరాన తాతపూడి (Tatapudi) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ మల్లేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం ఉత్తరాషాడ నక్షత్రం (1వ పాదం) చెందినది. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ మల్లేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతుంది. దనుస్సు రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: మండపేట - రావులపాలెం బస్సులు / ఆటోలు కొత్తూరు సెంటర్ మీదగా ఉంటాయి.

* కొత్తూరు సెంటర్ నుంచి తాతపూడికు (వయా) చింతలూరు మీదగా ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. కొత్తూరు సెంటర్ నుంచి తాతపూడి దూరం సుమారు 5.5 Kms.

రవాణా సమాచారం: కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె. గంగవరం మీదగా ఉంటాయి.

* కోటిపల్లి రేవు నుంచి వాకతిప్ప గ్రామం (వయా) వాకతిప్ప బ్రిడ్జి (గోదావరి గట్టు) మీదగా ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. వీటి మధ్య దూరం సుమారు 19 Kms.

రవాణా సమాచారం: కోటిపల్లి రేవు నుంచి రావులపాలెంకు షేరింగ్ ఆటోలు (Via) కోరుమిల్లి, కూళ్ళ (శ్రీ దుర్గా ఆలయం), కపిలేశ్వరపురం, వాకతిప్ప బ్రిడ్జి (గోదావరి గట్టు) మీదగా ఉంటాయి.

* వాకతిప్ప బ్రిడ్జి (గోదావరి గట్టు) నుంచి వాకతిప్ప గ్రామం దూరం సుమారు 500 meters only.

అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ మాగాపు మాచరరావు, సెల్ నెం : 83676 24988 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ఉత్తరాషాఢ నక్షత్రం స్తోత్రం

విశ్వేదేవా శ్రుణుతేమ హవమేయే అంతరిక్షేయ ఉప ఘవిష్టమ్‌|

అగ్నిజిహ్వా ఉతవాయజత్రా అసాధ్యా స్మిన్హా మదాయ ధ్వమ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.