గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

నవాబుపేట గ్రామం / NAVABUPETA VILLAGE

శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి

తులారాశి, విశాఖ నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా సుమారు 31 kms. దూరాన నవాబుపేట (Navabupeta) అను గ్రామం కలదు. మండపేట - ఆలమూరు రోడ్డు మార్గములో కొత్తూరు సెంటర్ ఉంటుంది. కొత్తూరు సెంటర్ బస్ స్టాప్ కు వాయువ్యం దిశగా సుమారు 05 Kms. దూరంలో నవాబుపేట గ్రామం కలదు. ఇచ్చట శ్రీ సోమేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం విశాఖ నక్షత్రం (3వ పాదం) చెందినది. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, గణపతి, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు నంది మూర్తులు కలరు. శ్రీ సోమేశ్వర లింగంకి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ ఏకాదశి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి రాత్రులు ఘనంగా జరుగుతాయి. తులరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం : మండపేట (కలువ పువ్వు సెంటర్) నుంచి నవాబుపేట గ్రామం నకు ఆటోలు దొరుకుతాయి. మండపేట నుంచి నవాబుపేట గ్రామం దూరం సుమారు 12 Kms. గా ఉంటుంది.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ పుల్లేటికుర్తి శివకేశవ శర్మ, సెల్ నెం: 99590 32225 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

విశాఖ నక్షత్రం స్తోత్రం

ఇంద్రాగ్నీ ఆగాత్‌ సుతం గీమినేమో వరేణాయ భూ:|

అస్య పాతం ధియేషితా||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.