గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

జగన్నాధగిరి గ్రామం, JAGANNADHAGIRI VILLAGE

శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

మిధునరాశి, మృగశిరి నక్షత్రం (4వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 08 kms. దూరాన జగన్నాధగిరి గ్రామం (Jagannadhagiri ) కలదు.  ద్రాక్షారామం - కాకినాడ రోడ్డు మార్గములో జగన్నాధగిరి గ్రామం ఉంటుంది. జగన్నాధగిరి శివాలయం బస్ స్టాప్ కు సమీపంలో శ్రీ అన్నపూర్ణా సమేత  శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంటుంది.  శ్రీ విశ్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ అన్నపూర్ణా సమేత  శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది.  ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ప్రధానాలయం, హోమశాల, వాహన శాల, చండీశ్వరుడు, నవగ్రహ మండపం ఉంటాయి.  ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది.  ముఖ మండపం నందు నందీశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి (ఉత్తరాభి ముఖం), అన్నపూర్ణా దేవి (దక్షిణాభి ముఖం) ఉన్నారు. అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి దర్శనం కూడ లభ్యమవుతుంది.  అంతరాలయం నందు గణపతి స్వామి కలరు. గర్భాలయం నందు  శ్రీ విశ్వేశ్వర లింగము దర్శనమిస్తుంది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది.

ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో లక్షపత్ర పూజ నిర్వహించుతారు.  కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. శాంతి కళ్యాణం, హోమం, జరుగుతాయి.  శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి. షష్ఠి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ధనుర్మాసం నందు' తీర్ధ బిందె ' కార్యక్రమం ఉంటుంది. ప్రతి మాస శివరాత్రి సందర్భముగా రుద్రాభిషేకం నిర్వహించుతారు.  ఆలయం నందు గ్రహ శాంతులు, హోమం, నామకరణం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలగునవి జరుపుతారు.  శ్రీ విశ్వేశ్వర లింగము, మృగశిర నక్షత్రం (4వ పాదం) చెందినది. ఈ రాశిలో జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహించుతారు.

రవాణా సమాచారం: కోటిపల్లి నుంచి కాకినాడ పోవు బస్సులు (Via) ద్రాక్షారామం,హసన్ బాద, ఉండూరు, జగన్నాధగిరి, గొల్లపాలెం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 8 Kms. దూరంలో జగన్నాధగిరి గ్రామం ఉంటుంది.  యాత్రికులు జగన్నాధగిరి లోని శివాలయం బస్ స్టేజి దిగాలి.  ద్రాక్షారామం నుంచి జగన్నాధగిరి మీదగా కాకినాడ కు షేరింగ్ ఆటోలు కూడ దొరుకుతాయి.

అర్చక స్వామి: మాకు సహకరించిన జగన్నాధగిరి అర్చక స్వామి శ్రీ చెరుకూరి నాగదత్తాత్రేయ శర్మ, సెల్: 7780208088 & 7207192247 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

మృగశిర నక్షత్రం స్తోత్రం

ఇమం దేవా అసపత్నం సుబధ్వం మహతే క్షత్రాయ మహతే|

జ్యేష్ఠాయ మహతే జాన రాజ్యాయేంద్ర స్యేంద్రియాయ

ఇమముష్యౌ పుత్ర మముష్యా పుత్రము ముష్యా విశ

ఏషవోమీరాజా సోమోస్యాకం బ్రాహ్మణానా రాజా||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.