గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

మండపేట గ్రామం / MANDAPETA VILLAGE

శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి

తులరాశి, స్వాతి నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 21 kms. దూరాన, మండపేట (Mandapeta) ఉంది. ఇది కోనసీమ జిల్లా, ఆలమూరు మండలంకు చెందినది. మండపేట నందు శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి (శివాలయం) కలదు. స్ధానికలు " రథం గుడి " అని పిలుస్తారు. అగస్త్య మహర్షి ప్రతిష్టించిన పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమిలో మండపేట క్షేత్రం ఒకటి (చెల్లూరు, తాపేశ్వరం, అర్తమూరు, వల్లూరు క్షేత్రాలు మిగిలిన ప్రతిష్టలు). శ్రీ అగస్తేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శివాలయం చాల ప్రాచీనమైనది. పునర్నిర్మాణము జరిగింది. శివాలయం (రథం గుడి) ప్రాంగణములో శ్రీ అగస్త్యేశ్వర స్వామి, శ్రీ జనార్దన స్వామి మరియు ఇతర దేవత మూర్తులు దర్శనమిస్తారు. రథం గుడి లో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వర స్వామి (శివాలయం) మరియు శ్రీదేవి భూదేవి సమేత జనార్ధన స్వామి ఆలయాలు తూర్పు అభిముఖంగా ఉంటాయి. శివ - కేశవ ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండుట విశేషం. వీరితో పాటు శ్రీ రమా సమేత సత్యనారాయణ, శ్రీ సీతారామచంద్రమూర్తి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సన్నిధిలు, అద్దాలమండపం మొదలగునవి కలవు.

స్ధల పురాణం: 17వ శతాబ్ధం లో పెద్దాపురం మహారాజ శ్రీ రాజా వత్సవాయి సూర్యనారాయణ తిమ్మజగపతి వర్మ ఒక శివాలయం నిర్మించుటకు ఒక శివలింగాన్ని తెప్పించినారు. భూమి పూజలో (తవ్వకాల్లో) అగస్త్య మహర్షి ప్రతిష్టించిన శివలింగము బయటపడినది. ఆ రెండు శివలింగాలు ప్రతిష్టించినారు. వీటిని శ్రీ అగస్తేశ్వర స్వామి మరియు శ్రీ కైలాసేశ్వర స్వామిగా పిలుస్తారు.

శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి రాత్రులు ఘనంగా జరుగుతాయి. తులరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. శ్రీ లక్ష్మీ సమేత జనార్ధనస్వామి వారి ఆలయ దర్శనం పుణ్యధాయకం.

రవాణా సమాచారం : కాకినాడ - రావులపాలెం ప్రధాన రహదారిలో మండపేట ఉంది. మండపేట - ఆలమూరు రోడ్డులో మండపేట రథం సెంటర్ ఉంటుంది. మండపేట (రథం సెంటర్) కు సుమారు ఒక Km. దూరాన (లోపలకి) రథం గుడి ఉంటుంది.

రవాణా సమాచారం : మండపేట బస్ స్టాండ్ నుంచి రథం గుడి కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 1.5 Kms.

రవాణా సమాచారం : రాజమండ్రి - కోటిపల్లి & రాజమండ్రి - యానాం బస్సులు (వయా) మండపేట బస్ స్టాండ్ మీదగా ఉంటాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ అయినవిల్లి సూర్య సుబ్రహ్మణ్య శర్మ, సెల్ నెం: 94917 18899 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

స్వాతి నక్షత్రం స్తోత్రం

క్యోయే తే సహస్రిణో స్థా సస్తే త్రిరాగది|

నియుత్వామ్‌ సోమ పీతయే||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.