గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

వడ్లమూరు గ్రామం / VADLAMURU VILLAGE

శ్రీ పార్వతీ సమేత వీరేశ్వర స్వామి

వృశ్చికరాశి, జ్యేష్ట నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా సుమారు 18 kms. దూరాన వడ్లమూరు (Vadlamuru) అను గ్రామం కలదు. చెల్లురు - వల్లూరు రోడ్డు మార్గములో వడ్లమూరు ఉంటుంది. ఇచ్చట శ్రీ వీరేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం జ్యేష్ట నక్షత్రం (1వ పాదం) చెందినది. శ్రీ వీరేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ పార్వతీ సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ వీరేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు చైత్ర శుద్ధ ఏకాదశి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. వృశ్చికరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: కాకినాడ - రావులపాలెం ప్రధాన రహదారిలో పసలపూడి వంతెన ఉంది. ఇక్కడ నుండి చెల్లూరు కు ఆటోలు ఉంటాయి. చెల్లూరు గ్రామంలో ఆటో స్టాండ్ కలదు. చెల్లూరు నుంచి వడ్లమూరు కు ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. వీటి మధ్య దూరం సుమారు 5 Kms.

రవాణా సమాచారం: రామచంద్రపురం నుంచి వాకతిప్ప బస్సులు (వయా) పసలపూడి వంతెన, చెల్లూరు మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం: మండపేట నుంచి కూడ వడ్లమూరు కు ఆటోలు ఏర్పాట్టు చేసుకోవచ్చు. వీటి మధ్య దూరం సుమారు 10 Kms.

రవాణా సమాచారం: మండపేట నుంచి కోరుమిల్లి బస్సులు (వయా) వల్లూరు, అంగర మీదగా ఉంటాయి. వల్లూరు నుంచి వడ్లమూరు కు ఆటోలు ఏర్పాట్టు చేసుకోవచ్చు. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ కొత్తలంక నాగేశ్వరరావు సెల్: 95507 28106 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

జ్యేష్ఠ నక్షత్రం స్తోత్రం

త్రాతార మింద్ర మవితార మింద్ర హవే హమ్‌ సుహవ|

శూరమింద్రమ్‌ హవయామి శక్రం పురహుతమింద్ర:

స్వాస్తినో మధ్యవాధా త్వింద్ర:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.