గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

నదురుబాదు గ్రామం / NADURUBADU VILLAGE

శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి

కన్యారాశి, ఉత్తర నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 11 kms. దూరాన, నదురుబాదు (Nadurubada) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, రాయవరం మండలంకు చెందినది. నదురుబాదు నందు శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి (శివాలయం) కలదు. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం : ఆలయం చాల ప్రాచీనమైనది. ప్రాంగణములో ధ్వజస్ధంభం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ ముఖ మంటపము పైన నటరాజస్వామి, మార్కండేయుని పరమేశ్వరుడు కాపాడిన ఘట్టం మరియు గీతోపదేశఘట్టం, ఆంజనేయస్వామి, గణపతి, కుమార స్వామి, లక్ష్మీ, సరస్వతుల విగ్రహములు దర్శనమిస్తాయి. శ్రీ మల్లేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవ రాత్రులు, గణపతి నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతాయి. కన్యారాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. ఆలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణీ, సత్య భామ నమేత వేణుగోపాలస్వామి ఆలయం కూడ ఉంది.

రవాణా సమాచారం: రామచంద్రపురం మార్కెట్టు సెంటర్ (Annapurna Theater) నుంచి నదురుబాదు కు ఆటో ప్రయాణం సౌకర్యంగా ఉండును. వీటి మధ్య దూరం సుమారు 5 కీల్లో మిటార్లుగా ఉంటుంది.

ఆలయ అర్చకులు: ఆలయ అర్చకులు శ్రీ విల్లూరి వీరభద్రరావు సెల్ నెం : 94915 77066 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ఉత్తర నక్షత్రం స్తోత్రం

దేవావ ధ్వర్యూశ్చ గతాస్థేన సూర్యాత్వచా మధ్వాయణం|

సమంజాథో తం ప్రత్నయాయం వినాశ్చిత్రం దేవానామ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.