గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

పెదపళ్ళ గ్రామం / PEDAPALLA VILLAGE

శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి

వృశ్చికరాశి, అనూరాధ నక్షత్రం (4వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి పశ్చిమ దిశగా సుమారు 25 kms. దూరాన పెదపళ్ళ (Pedapalla) అను గ్రామం కలదు. మండపేట - ఆలమూరు రోడ్డు మార్గములో కొత్తూరు సెంటర్ ఉంటుంది. ఇక్కడ బస్సులు ఆగుతాయి. కొత్తూరు సెంటర్ నుంచి పెదపళ్ళ గ్రామం నకు ఆటోలు ఉంటాయి. ఇచ్చట శ్రీ రామలింగేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అనూరాధ నక్షత్రం (4వ పాదం) చెందినది. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ రామలింగేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ బహుళ ఏకాదశి పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. వృశ్చికరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: కాకినాడ - రావులపాలెం బస్సులు (via) కరప, మండపేట, గుమ్మిలేరు, కొత్తూరు సెంటర్ మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం: కాకినాడ - కొత్తూరు సెంటర్ దూరం 52 Kms.

రవాణా సమాచారం: కొత్తూరు సెంటర్ నుంచి వెదురుమూడి (Via) కొత్తూరు, పెదపళ్ళ, పినపళ్ళ బస్ స్టాప్ మీదగా ఆటోలు ఉంటాయి. కొత్తూరు సెంటర్ నుంచి పెదపళ్ళ బస్ స్టాప్ మధ్య దూరం సుమారు 2 Kms. మాత్రమే. పెదపళ్ళ బస్ స్టాప్ నుంచి పెదపళ్ళ గ్రామం కు ఆటోలు చాల తక్కువుగా దొరుకుతాయి. పెదపళ్ళ బస్ స్టాప్ నుంచి పెదపళ్ళ గ్రామం దూరం సుమారు 500 meters.

రవాణా సమాచారం: కాకినాడ - కత్తుంగ బస్సులు (via) ద్రాక్షారామం, వెదురుమూడి, పెదపళ్ళ, కొత్తూరు, రావులపాలెం మీదగా ఉంటాయి. ఇవి చాల తక్కువుగా ఉంటాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ బుచ్చి శివరామశాస్త్రి సెల్: 9989282253, పండు సెల్: 9989990029 మరియు శ్రీ ఇలపర్తి సీతారామశాస్త్రి సెల్ : 73825 76596 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

అనురాధ నక్షత్రం స్తోత్రం

నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయత దృత్‌|

సపర్యత్‌ దూర్‌ దేశే దేశే దేవ జాతాయ కేతవే

దివసు పుత్రాయ సూర్యాయశ్‌ సత్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.