గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

మసకపల్లి గ్రామం / MASAKAPALLI VILLAGE

శ్రీ పార్వతీ భ్రమరాంబా సమేత మల్లీశ్వర స్వామి

కుంభ రాశి, ధనిష్ఠ నక్షత్రం (3వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా సుమారు 13 kms. దూరాన, గోదావరి నదీ తీరం నందు మసకపల్లి (Masakapalli) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ మల్లీశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ భ్రమరాంబా సమేత మల్లీశ్వర స్వామి వారి ఆలయం ధనిష్ఠ నక్షత్రం (3వ పాదం) చెందినది. శ్రీ మల్లీశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ పార్వతీ భ్రమరాంబా సమేత మల్లీశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. మసకపల్లి గ్రామం రెండు సార్లు గోదావరిలో మునిగిపోయినది. ఇప్పటి ఆలయం మూడవ సారి నిర్మించారు. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, భ్రమరాంబదేవి, నవగ్రహ మండపం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ మల్లీశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ పార్వతీ భ్రమరాంబా సమేత మల్లీశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి నిర్వ హించబడతాయి. కుంభ రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. ప్రస్తుతం శివాలయంకు అర్చకస్వామి లేరు. మసకపల్లి గ్రామం నందు శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి వారి ఆలయం ఉంది.

స్ధల పురాణం: పవిత్ర గోదావరి నదికి ఉత్తర తీరం నందు మసకపల్లి క్షేత్రం ఉంది. క్షేత్రానికి సమీపం లో త్రివేణి సంగమం కలదు. పూర్వము మసకపల్లి గ్రామాన్ని "మస్కరపురి" అనే నామంతో వ్యవహరించేవారు. మస్కరులు అనగా మునీశ్వరులు. మునులు తపస్సుచేసిన ప్రాంతం కాబట్టి మస్కరపురి నామం వచ్చినట్లు కథనం. మల్లికార్జున లింగమును పార్థప్రహార శివలింగంగా చెబుతారు. పూర్వము కిరాతార్జునీయ ఘట్టంలో పార్ధునకు పరమశివునకు యుద్ధం జరిగిన సంధర్భంలో పార్థుడు తన గాండీవముతో శివయ్య శిరస్సుపై మోదినట్లు కథ ఉంది. స్వామి శిరస్సుపై పడిన గాయం తాలూకు రక్తపు మరక శివలింగంపై ఎరుపు రంగులో దర్శనమిస్తుంది అని స్ధానికులు చెప్పుచుంటారు.

రవాణా సమాచారం: రామచంద్రాపురం నుంచి మసకపల్లి గ్రామం నకు (Via) ద్రాక్షారామం, కోలంక గ్రామం, బ్రహ్మపురి మీదగా బస్సులు పరిమితంగా ఉన్నాయి.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నకు సుమారు 21 kms. దూరాన యానాం అను పట్టణం ఉంది. రాజమండ్రి నుంచి యానాం పోవు బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, కోలంక బస్ స్టాప్, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. కోలంక మరియు ఇంజరం నుంచి మసకపల్లి గ్రామం నకు రోడ్డు మార్గములున్నాయి.

* యానాం నుంచి మసకపల్లి గ్రామం నకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 12 kms. యానాం బైపాస్ రోడ్ (Sri Ravi Junior & Degree College, Near Yanam Bi Pass road, Sunkarapalem, Andhra Pradesh) నుంచి మసకపల్లి గ్రామంనకు గోదావరి గట్టు మీదగా ఆటోలు ఉంటాయి. షేరింగ్ ఆటోలు చాల తక్కువుగా ఉంటాయి. ఆటో రాను - పోను ఏర్పాట్లు చేసుకోవాలి.

అర్చక స్వామి: ప్రస్తుతం వైష్ణవ అర్చకస్వామి శ్రీ S.V.N. మూర్తి గారు Cell No.8179070179 శివాలయం కూడ చూసుచున్నారు. వీరిని సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ధనిష్ఠ నక్షత్రం స్తోత్రం

వసో: పవిత్రమసి శతధారం వసో: పవిత్రమసి సహస్రధారమ్‌|

దేవస్త్యా సవితా పునాత్‌ వసో: పవిత్రేణ శతధారేణ సుప్త్వా కామధుక్ష:

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.