గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

దుళ్ళ గ్రామం / DULLA VILLAGE

శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి సమేత అగస్త్యేశ్వర స్వామి

తులారాశి, విశాఖ నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 28 kms. దూరాన దుళ్ళ (Dulla) అను గ్రామం కలదు. మండపేట - ఏడిది - కడియం రోడ్డు మార్గములో దుళ్ళ గ్రామం ఉంటుంది.

పూర్వం దూర్వాసపురంగా పిలిచేవారు. అగస్త్య మహర్షి వాతాపి అను ఒక బ్రహ్మ రాక్షసుని సంహరించాడు. పాప పరిహారార్ధం మహర్షి ఒక శివ లింగమును ప్రతిష్టించినట్లు స్ధల పురాణం తెల్పుతుంది. ఆ లింగము శ్రీ అగస్త్యేశ్వర లింగముగా ఖ్యాతి పొందింది. అమ్మ వారు శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తుల సేవలు స్వీకరించు చున్నాది. శ్రీ అగస్త్యేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

శ్లో|| వాతాపి దైత్యదమన దోషశాంతి చికీర్షయా

బాలాత్రిపురయా శంభుః అగస్త్యేన ప్రతిష్ఠితః!!

శ్రీ దుర్వాసపురే రమ్యే సర్వసంపత్సమన్వితే

అగస్త్యేశ్వర నామ్నాసౌ లోకాన వతిసర్వదా!!

ఆలయం: దుళ్ళ గ్రామం లోని శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. ఇది అగస్త్య మహర్షి ప్రతిష్టగా చెప్పుబడుతుంది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. మూడు అంతస్ధుల గాలిగోపురం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. గాలిగోపురం నకు ఎడమ భాగములో భారీ నటరాజు మూర్తి విగ్రహం కలదు. గాలిగోపురం క్రింద నుంచి ఆలయ ప్రవేశం జరుగుతుంది. ఆలయ ప్రాంగణము చాల విశాలముగా ఉంటుంది. ధ్వజ స్ధంబం, ప్రధానాలయం, చండీశ్వరుడు, నవగ్రహ మండపం ఉంటాయి. ముఖ మండపం నందు నందీశ్వరుడు ఉంటాడు. శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి మరియు వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలు కలవు. అంతరాలయం నందు గణపతి, ఆంజనేయ స్వామి కొలువైన్నారు. గర్భాలయం నందు శ్రీ అగస్త్యేశ్వర లింగము దర్శనమిస్తుంది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, అభిషేక శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం మాఘ బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. సంక్రాంతి, దీపావళీ మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా జరుగుతాయి.

శ్రీ అగస్త్యేశ్వర లింగము, విశాఖ నక్షత్రం (1వ పాదం) చెందినది. విశాఖ నక్షత్రం నందలి 1వ పాదము లో జన్మంచిన స్త్రీ వలన మరదలుకి, పురుషుడు వలన బావమరిదికి దోషం కలుగను. విశాఖ నక్షత్రం (1వ పాదం) నందు జన్మించిన వారికి ఆలయం నందు శాంతులు నిర్వహించుతారు.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి రాజమండ్రి బస్సులు (via) రామచంద్రపురం, మండపేట మీదగా ఉంటాయి. మండపేట (కలువ పువ్వు సెంటర్) నుంచి దుళ్ళ గ్రామం నకు (via) ఏడిది మీదగా ఆటోలు దొరుకుతాయి. మండపేట నుంచి దుళ్ళ గ్రామం దూరం సుమారు 08 Kms. గా ఉంటుంది.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన దుళ్ళ - శ్రీ అగస్త్యేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ బాదంపూడి వెంకట శివయ్య శర్మ, సెల్ నెం. 9908086836 గార్కి నా నమసుమాంజలి

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

విశాఖ నక్షత్రం స్తోత్రం

ఇంద్రాగ్నీ ఆగాత్‌ సుతం గీమినేమో వరేణాయ భూ:|

అస్య పాతం ధియేషితా||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.