గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

పెడపర్తి గ్రామం / PEDAPARTHI VILLAGE

శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి

కన్యారాశి, హస్త నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 18 kms. దూరాన, పెడపర్తి (Pedaparthi) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలంకు చెందినది. పెడపర్తి నందు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి (శివాలయం) కలదు. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: ఆలయం చాల ప్రాచీనమైనది. పునర్నిర్మాణము జరిగింది. ప్రాంగణములో ధ్వజస్ధంభం, యాగశాల, చండీశ్వరాలయం, మహానంది, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము మరియు ముఖమంటపం నందు శ్రీ దక్షిణామూర్తి, అర్ధనారీశ్వరులు, గణపతి ఇత్యాది దేవతా మూర్తులు అద్భుతంగా శిల్పీకరించబడ్డాయి. ముఖమంటపం లోపలి పై కప్పు పైన ద్వాదశ రాశులు చిత్రించబడ్డాయి. అంతరాలయంలో గణపతి కొలువై యున్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవ రాత్రులు, గణపతి నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతాయి. కన్యారాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. ఆలయ అర్చకులు శ్రీ యలమంచలి ప్రసాద్ శర్మ, సెల్ నెం: 98498 28891 సంప్రదించగలరు.

రవాణా సమాచారం : రామచంద్రపురం నుంచి మండపేట పోవు రహదారిలో పెడపర్తి రేవు అను బస్సు స్టాపు ఉంది. ప్రయాణికుల అభ్యర్ధన బట్టి బస్సులు ఆగుతాయి. పెడపర్తి రేవు నుంచి పెడపర్తి గ్రామం నకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 2 కీల్లో మిటార్లుగా ఉంటుంది.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ యలమంచలి ప్రసాద్ శర్మ, సెల్ నెం: 98498 28891 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

హస్త నక్షత్రం స్తోత్రం

విభ్రాడ బృహత్‌ పిబతు సౌమ్య మధ్యాయుర్ధగ యజ్ఞపతిం చ విహుతం

వాతజూతో యో అభిరక్షతుత్మనా ప్రజా: పుషోషపురుధ విరాజితి||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.