గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

వెదురుమూడి గ్రామం / VEDURUMUDI VILLAGE

శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి

వృశ్చికరాశి, జ్యేష్ట నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి పశ్చిమ దిశగా సుమారు 21 kms. దూరాన వెదురుమూడి (Vedurumudi) అను గ్రామం కలదు. కొత్తూరు సెంటర్ - అంగర రోడ్డు మార్గములో వెదురుమూడి ఉంటుంది. ఇచ్చట శ్రీ మల్లేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం జ్యేష్ట నక్షత్రం (3వ పాదం) చెందినది. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ మల్లేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ మల్లేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు ఫాల్గుణ బహుళ షష్ఠి నుంచి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. వృశ్చికరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: కాకినాడ - రావులపాలెం బస్సులు (via) కరప, మండపేట, గుమ్మిలేరు, కొత్తూరు సెంటర్ మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం: కాకినాడ - కొత్తూరు సెంటర్ దూరం 52 Kms. కొత్తూరు సెంటర్ నుంచి వెదురుమూడి (Via) కొత్తూరు, పినపళ్ళ బస్ స్టాప్ మీదగా ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms. మాత్రమే.

రవాణా సమాచారం: కాకినాడ - కత్తుంగ బస్సులు (via) ద్రాక్షారామం, వెదురుమూడి, కొత్తూరు, రావులపాలెం మీదగా ఉంటాయి. ఇవి చాల తక్కువుగా ఉంటాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ కంఠం మల్లేశ్వరశర్మ సెల్: 9441140385 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

జ్యేష్ఠ నక్షత్రం స్తోత్రం

త్రాతార మింద్ర మవితార మింద్ర హవే హమ్‌ సుహవ|

శూరమింద్రమ్‌ హవయామి శక్రం పురహుతమింద్ర:

స్వాస్తినో మధ్యవాధా త్వింద్ర:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.