గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

బాలాంతరం గ్రామం / BALANTARAM VILLAGE

శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్వేశ్వర స్వామి

మీన రాశి, రేవతి నక్షత్రం (4వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 6.5 kms. దూరాన, బాలాంతరం (Balantram) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్వేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ అగస్త్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్వేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరుడు, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. ఆలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం వద్ద ద్వారపాలకులు, పైన శివమూర్తిని దర్శించగలము. శ్రీ అగస్త్వేశ్వరలింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్వేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు నిర్వ హించబడతాయి. మీన రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 6 Kms. దూరంలో బాలాంత్రం బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్వేశ్వర ర స్వామి మధ్య దూరం సుమారు 500 meters గా ఉంటుంది. ఆటోలు ఉండవు. స్వంత వాహనములు కలిగిన వారికి బాగుంటుంది.

* ద్రాక్షారామం నుంచి బాలాంత్ర గుడికి ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. ఇది సౌక్యం.

అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ దొంతికుర్తి కామరాజు శర్మ , సెల్ నెం: 99890 75537 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం

తనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్‌ పృథివీ సముద్ర:|

విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.