గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

మారేడుబాక గ్రామం / MAREDUBAKA VILLAGE

శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి

తులరాశి, స్వాతి నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 18 kms. దూరాన, మారేడుబాక (Maredubaka) గ్రామం ఉంది. ఇది కోనసీమ జిల్లా, రాయవరం మండలంకు చెందినది. మారేడుబాక నందు శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి (శివాలయం) కలదు. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శివాలయం చాల ప్రాచీనమైనది. పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవత మూర్తులు కలరు. ప్రభావవంతమైన శివలింగ ప్రతిష్ట సప్తఋషుల ద్వారా జరిగినట్లు చెప్పబడుచున్నది.

శ్రీ మల్లేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుండి శుద్ధ పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి రాత్రులు ఘనంగా జరుగుతాయి. తులరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. శ్రీ లక్ష్మీ సమేత జనార్ధనస్వామి వారి ఆలయ దర్శనం పుణ్యధాయకం.

రవాణా సమాచారం 1: రామచంద్రపురం - మండ పేట ప్రధాన రహదారి నందు మాచవరం సెంటర్ ఉంది. దీనిని సోమేశ్వరం వంతెన అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మారేడుబాక ఆటోలు ఉంటాయి.

రవాణా సమాచారం 2: రామచంద్రపురం - మండపేట ఆటోలు (వయా) మారేడుబాక మీదగా ఉంటాయి. రామచంద్రపురం (రాజగోపాల సెంటర్) నుంచి కూడ మండపేట దొరుకుతాయి.

రవాణా సమాచారం 3: మండపేట నుంచి మారేడుబాక కు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ కొమాళ్ళపల్లి రామసుబ్బారాయుడు, సెల్ నెం: 99482 69059 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

స్వాతి నక్షత్రం స్తోత్రం

క్యోయే తే సహస్రిణో స్థా సస్తే త్రిరాగది|

నియుత్వామ్‌ సోమ పీతయే||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.